Wednesday, September 18, 2024

Paris Olympics | విరుచుకుపడ్డ విక్ట‌ర్.. సెమీస్ లో భార‌త్ ఓట‌మి..

పారిస్ ఒలింపిక్స్ ఆరంభం నుంచే భారీ అంచనాలతో దూసుకెళ్తున్న భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌ కు సెమీస్ లో షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్‌ ఆటగాడు విక్టర్‌ అక్సెల్‌సెన్‌తో తలపడిన లక్ష్య సేన్‌ వరుస సెట్లలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 20-22 పాయింట్ల తేడాతో కోల్పోయిన సేన్.. రెండో సెట్ లో ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నించాడు.

అయితే, విక్టర్ బలమైన షాట్లతో చెలరేగడంతో….. సేన్ రెండో సెట్ ను 21-14 పాయింట్ల తేడాతో కోల్పోయాడు. దాంతో ప్రపంచ క్రీడల్లో తొలి ఫైనల్ ఆడాలన్న లక్ష్యసేన్ కల చెదిరిపోయింది. అయితే.. పతకం సాధించేందుకు ల‌క్ష్య సేన్ కు మరో అవకాశం ఉంది.

ఈరోజే జ‌రిగిన‌ మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ వితిద్సరన్ చేతిలో ఓడిన మలేషియాకు చెందిన లీ జీ జియా ఓట‌మిపాట‌య్యాడు. కాగా, సోమవారం కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మలేషియా షట్లర్ లీ జిల్ జియాతో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement