Sunday, September 15, 2024

Para Olympics – షూట‌ర్ అవనికి గోల్డ్ .. మోనాకు కాంస్యం

పారా షూటర్ అవనీ లేఖరా అద్భుతం చేసింది. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎహెచ్ 1లో బంగారుపతకం సాధించింది. దాంతో రెండోరోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. ఇదిలాఉంటే.. టోక్యో పారాలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పసిడి గెలిచిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం కూడా గెలిచింది.. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో సైతం స‌త్తా చాటి మ‌రో గోల్డ్ ను త‌న ఖాతాలో వేసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement