Saturday, October 5, 2024

Shirdi | సాయి బాబాకు రూ.కోట్ల విలువైన బంగారం విరాళం

షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని భక్తులు నిత్యం దర్శించుకుంటూనే ఉంటారు. దేశంలోని నలుమూలల నుంచే వచ్చే వారితో పాటు విదేశాల నుంచి వారు బాబాకి కానుకల రూపంలో విరాళాలు సమర్పించుకుంటారు. కాగా, ఈరోజు మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సాయి భక్తుడు 1 కిలోల 434 గ్రాముల బంగారు పంచరతిని సాయిచరానికి సమర్పించినట్లు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు.

దాదాపు రూ.1 కోటి విలువ చేసే ఆ సమైని సాయిబాబా పాదాల వద్ద సమర్పించి, సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్‌కు అప్పగించారు. అనంతరం సాయిబాబా సంస్థాన్ తరపున సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ దాతలను శాలువాతో పాటు శ్రీసాయిబాబా విగ్రహాన్ని బహూకరించి సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement