పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టులో ఆశాజనక యువ క్రీడాకారిణి అయేషా నసీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైంది. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. ఆయేషా వయసు 18 ఏళ్లు మాత్రమే. ఇస్లాం ధర్మం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. గురువారం తన నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది అయేషా నసీమ్. 2020లో పాకిస్థాన్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆయేషా.. ‘నేను క్రికెట్ను వదిలి ఇస్లాం ప్రకారం జీవించాలనుకుంటున్నాను’ అని పీసీబీకి తెలిపింది.
అయేషా నసీమ్ క్రికెట్ కెరీర్
అయేషా నసీమ్ పాకిస్థాన్ తరఫున 4 వన్డేలు, 30 టీ20లు ఆడింది. తన 30 మ్యాచ్ల T20 కెరీర్లో 128 స్ట్రైక్ రేట్తో 369 పరుగులు చేసింది అయేషా నసీమ్. వన్డేల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసింది. తన టీ20 కెరీర్లో 18 సిక్సర్లు కూడా కొట్టింది ఈ పాక్ మహిళల.