Friday, September 6, 2024

Kolkata: ఇవాళ బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన

ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోపీఎం మోదీ పర్యటించనున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు.

- Advertisement -

కాగా, స్వామిజీ వివేకనంద ఇంటికి వెళ్లి ఆయన విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులు ఆర్పించనున్నారు. అయితే, రోడ్ షో ప్రారంభానికి ముందు బాగ్‌బజార్‌లోని తల్లి శారదా ఇంటిని కూడా ఆయన సందర్శించనున్నారు. ఈ కార్యక్రమం దాదాపు 40 నిమిషాల పాటు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. రోడ్ షో థీమ్‌ను ‘బంగాలీర్ మోనే మోడీ’ అంటే ‘బెంగాలీల మదిలో మోడీ’ అని ఉంచారు. కోల్ కతాలో రోడ్ షో అనంతరం ఇవాళ (మంగళవారం) రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని బస చేస్తారు. దీని తర్వాత రేపు (బుధవారం) దక్షిణ 24 పరగణాస్‌లోని మధురాపూర్‌లో మోడీ మరో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement