Thursday, October 24, 2024

ADB | రోడ్డు ప్రమాదలో ఒకరు మృతి… మరొకరికి తీవ్రయాలు

జన్నారం, (ఆంధ్రప్రభ): మండలంలోని పైడిపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రొక‌రికి తీవ్రగాయాల‌య్యాయి.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ చెరుకుగూడెంకు చెందిన కట్లకుంట రాజన్న(52), ఐకేపీ వీఓఏ ముల్కల్ల రవీందర్ గురువారం రాత్రి స్యూటీపై వస్తుండగా… పైడిపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై బండ‌రాయిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రవీందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వీరిద్దరు దండేపల్లి మండలం పెద్దయ్యదేవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్‌ఐ గుండేటి రాజవర్ధన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement