Friday, September 20, 2024

Delhi | మ‌రోసారి హ‌స్తిన‌కు సీఎం రేవంత్ !

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. కాగా, ఆయన ఢిల్లీ పర్యటన ఈ నెల 16న ఖరారైంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా వెళ్లే అవకాశం ఉంది.

ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement