Tuesday, October 22, 2024

TG | మాదాపూర్‌లో మరోసారి భారీ డ్రగ్స్‌ కలకలం

మాదాపూర్​లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్‌తోపాటు వ్యాపారులు మాలిక్‌ లోకేష్‌, సందీప్‌రెడ్డి, రాహుల్‌, సుబ్రహ్మణ్యంలను టీజీ న్యాబ్​, మాదాపూర్​ పోలీసులు పట్టుకున్నారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వచ్చే ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతంలోనూ సాయిచరణ్​ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. సాయిచరణ్‌ డ్రగ్స్‌ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్‌ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్‌తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement