Saturday, September 21, 2024

ఆదివారం ఎఫెక్ట్…దేశంలో తగ్గిన కరోనా కేసులు

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన వారం రోజులలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు నాలుగు లక్షలకు పైచిలుకు కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఆదివారం ఆ సంఖ్య 3.6 లక్షల కు వచ్చింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,66,317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీనితో మొత్తం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,26,62,410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మ‌రో వైపు గడిచిన 24 గంటలల్లో 3,747 మంది క‌రోనాతో మృతి చెందారు. కాగా తాజాగా గణాంకాల ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 2,46,146కు పెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement