Friday, September 20, 2024

Olympics – మ‌రికొద్దిసేప‌టిలో మ‌న షూట‌ర్స్ కాంస్య ప‌త‌కం పోరు…

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం సాధించే అవకాశం వచ్చింది. స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు మహేశ్వరి-అనంత్‌ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. మూడు రౌండ్లలో కలిపి భారత్‌ 146 పాయింట్లు దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచింది. చైనా జోడీ (జియాంగ్,జియాన్లిన్) కూడా 146 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌లో నిలిచింది. దీంతో కాంస్యం కోసం చైనాతో నేటి సాయంత్రం ఈ ఇద్ద‌రు షూట‌ర్లు త‌ల‌ప‌డ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement