Monday, September 9, 2024

Olympics | సెమీస్ కు దూసుకెళ్లిన‌ ల‌క్ష్య సేన్…

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. నేడు జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో లక్ష్యసేన్ విజయం సాదించాడు. కాగా, ఈ విజయంతో లక్ష్యసేన్ చరిత్ర లిఖించాడు. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన 12వ సీడ్ చౌ టియన్ చెన్‌తో తలపడిన లక్ష్య సేన్ 19-21, 21-15, 21-12 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్ర‌వేశించాడు.

ఇక, రేపు జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూ…. డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన వారు ఆగస్టు 4న జరిగే మ‌రో సెమీ ఫైనల్ రౌండ్‌లో లక్ష్యసేన్‌తో తలపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement