Sunday, October 20, 2024

Paris Olympics | ప్రీ క్వార్ట‌ర్స్ లో సింధు ఇంటి బాట‌..

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు (గురువారం) మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ సింధు కు నిరాశే ఎదురైంది. ప్రిక్వార్టర్స్ (16వ రౌండ్)లో చైనా క్రీడాకారిణి ఆరో సీడ్ హెబింగ్జియావోతో తలపడిన సింధు… వరుస సెట్లలో 19-21, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది..

ఇక ఇప్ప‌టికే జ‌రిగిన పురుషుల డ‌బుల్స్ ఈవెంట్ క్వార్ట‌ర్ పైన‌ల్లో భారత స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ లు చైనీస్ తైపీ జోడీ అయిన‌ ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్ చేతిలో ఓడిపోయారు. మరోవైపు, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ 16)లో హెచ్ ఎస్ ప్రణయ్ – లక్ష్యసేన్ తలపడగా… ప్రణయ్ ఇంటిబాట‌ పట్టాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు లక్ష్యసేన్‌ ఒక్కడే మిగిలాడు. కాగా, రేపు జ‌ర‌గ‌నున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్లో చైనీస్ తైపీకి చెందిన 12వ సీడ్ చౌ టిఎన్-చెన్ తో త‌ల‌ప‌డ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement