Tuesday, September 17, 2024

TG | ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది.. ఉప ముఖ్యమత్రి భట్టి ఏమన్నారంటే..

ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం కమలాపురంలో ఉప‌ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి మాట్లాడుతూ… మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. అంగన్ వాడీలో 3 వ తరగతి వరకు ఏర్పాటు చేసి నాల్గో తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు పంపించే ఏర్పాటుకు నాంది పలికామని అన్నారు.

ఇక నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు గేదెలు ఇచ్చి వారిని పరిశ్రమలో వాటా దారులుగా చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. నియోజకవర్గంలో మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement