Wednesday, September 18, 2024

TG | కాళోజీ వర్సిటీలో పీజీ డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌…

పీజీ డెంటల్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్‌-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది. ఇక‌ ఈ నెల 4న ఉదయం 8 గంటల నుంచి 8న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఎండీఎస్‌ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ http://www.knruhs.telangana.gov.in సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement