Wednesday, September 18, 2024

TG | ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు

ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ప్యానెల్ సెక్రటరీకి కమిషన్ ఛైర్మన్‌ నేరేళ్ల శారద ఆదేశించారు. మహిళా కమిషన్ ఎదుట హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కమిషన్‌ కార్యాలయంలో రాఖీ కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే అక్కడి ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్‌కు పర్మిషన్ లేకపోయినా కూడా సీక్రెట్‌గా మొబైల్ ఫోన్‌ తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై సీరియస్ అయ్యారు. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతిసేలా ప్రవర్తించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇందులో ప్రమేయం ఉన్న సభ్యులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారిపై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాలని కమిషన్ కార్యదర్శిని ఆదేశించినట్లు చైర్ పర్సన్ తెలిపారు. మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిబద్ధత విషయంలో రాజీపడే వైఖరిని సహించేది లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement