Thursday, September 12, 2024

Paralympics | మ‌హిళ‌లు అదుర్స్.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మ‌రో ప‌త‌కం !

పారాలింపిక్స్‌ 2024లో భారత్‌కు మరో పతకం దక్కింది. బ్యాడ్మింటన్ మ‌హిళ‌ల‌ సింగిల్స్ ఎస్‌యూ5లో భారత పారా షట్లర్ తులసిమతి మురుగేషన్ ర‌జత‌ పతకం సాధించింది. ఈరోజు (సోమవారం) జరిగిన ఫైనల్లో ర‌న్న‌రప్ గా నిలిచిన తుల‌సిమ‌తి.. ర‌జ‌తం ద‌క్కించుకుంది.

చైనా క్రీడాకారిని యాంగ్ క్విక్సియా తో త‌ల‌ప‌డిన తులసిమతి… వ‌రుస‌ సెట్ల‌లో 21-17, 21-10 తేడాతో ఓట‌మిపాలైంది. దీంతో భార‌త్ తృటిలో స్వ‌ర్ణ ప‌త‌కం చేజార్చుకుంది.

మరోవైపు ఇదే విభాగంలో భారత్‌ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో డెన్మార్క్ క్రీడాకారిణి కేథరిన్ రోసెన్‌గ్రెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీషా రామదాస్ 21-12, 21-8 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పారిస్ పారాలింపిక్స్ లో భార‌త ప‌త‌కాల సంఖ్య 11కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement