Friday, September 20, 2024

Nizamabad – రైలు నుంచి జారిపడి యువకుడు మృతి…

నవీపేట్ ఆగస్టు 18 ప్రభ న్యూస్ – నవీపేట మండలం లోని ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న రైలు నుండి ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందాడు. రైల్వే ఎస్సై సాయ రెడ్డి సమాచారం మేరకు బోధన్ మండల కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతానికి చెందిన బాలాజీ తన చెల్లెలు పూజతో కలిసి పర్భని ప్యాసింజర్ లో ప్రయాణిస్తుండగా ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అది గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను ఆపి క్షతగాత్రుడిని బాసర కు తీసుకురాగా అప్పటికే సిద్దంగా ఉంచిన 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి మృతి చెందాడని ప్ర‌క‌టించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్సై సాయ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement