Sunday, September 22, 2024

Paris Olympics | క్వార్టర్స్‌లో నిషా పరాజయం..

పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు జరిగిన రెజ్లింగ్ పోటీలో భారత్ ప‌రాజయం పాలైంది. మహిళల 68 కేజీల క్వార్టర్‌ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన పాక్‌ సోల్‌ గమ్‌తో త‌ల‌ప‌డిన నిషా… అనూహ్య రీతిలో ఓటమి చ‌విచూసింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించిన నిషా.. ద్వితీయార్థంలో గాయపడింది.

దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ప్రత్యర్థి చేతిలోకి వెళ్లింది. అప్పటి వరకు 8-2తో ఆధిక్యంలో ఉన్న నిషా… గాయం కారణంగా 8-10 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

కాగా, అంతకుముందే ఉక్రెయిన్ క్రీడాకారిణి టెటియానా రిజ్కోతో ప్రిక్వార్టర్స్‌లో తలపడిన నిషా చివరి 30 సెకన్లలో కీల‌క పాయింట్ ద‌క్కించుకుని విజయం సాధించింది. అయితే, దురదృష్టవశాత్తు గాయం కారణంగా క్వార్టర్స్‌లో ఓడిపోయింది. నిషా ఓటమితో పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్‌లో భారత్‌ పోరు ముగిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement