Friday, September 20, 2024

రేపే కౌంటింగ్… ఎస్ఈసీ అదనపు మార్గదర్శకాలు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ రేపు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎటువంటి గొడవలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఓట్ల లెక్కింపు దృష్ట్యా అదనపు మార్గదర్శకాలను ఎస్‍ఈసీ జారీ చేశారు.

కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. జనరేటర్లు, ఇన్వెటర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ను వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజ్‍ ను ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని సూచనలు చేశారు. రాత్రి 8.00గంటల కల్లా కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా చూడాలన్నారు. పది కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్‍కు అనుమతి ఇవ్వాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement