Friday, September 13, 2024

Nizam Sagar: నిండుకుండలా నిజాంసాగర్‌.. మూడు గేట్లు ఎత్తివేత‌

నిజాంసాగర్: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలో విడుదల చేస్తున్నారు.

ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు). ప్రస్తుతం 1,404 అడుగుల (17.079టీఎంసీలు)కు చేరుకుంది. దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement