Wednesday, September 18, 2024

PM మోదీ ఇంటికి కొత్త మెంబ‌ర్

దీప్‌జ్యోతి రాక‌తో సంతోషంగా ఉంది
ఆవు దూడ‌తో ఆప్యాయంగా ప్ర‌ధాని
పూజ గ‌దిలో సంబురం
ముద్దులు పెడుతూ ఆనందం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: ప్రధాని మోదీ కుటుంబంలోకి మరో కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో మోదీ పెంచుకుంటున్న ఓ ఆవు గర్భం దాల్చింది. ముదురు గోధుమ రంగులో నుదిటిపై కాంతి గుర్తుతో ఉన్న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

నుదిటిపై కాంతి గుర్తుతో చూడముచ్చటగా ఉన్న దూడకు దీప్‌జ్యోతి అని నామకరణం చేసినట్లు మోదీ వెల్లడించారు. ఇక, ఆవు దూడతో ప్రధాని తన నివాసంలో ఎంతో సరదాగా గడిపారు. పూజ గదిలో దూడను పక్కనే పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఎత్తుకుని.. ఆప్యాయంగా నుదిటిపై ముద్దాడారు. ఈ ఫొటోలను ప్ర‌ధాని మోదీ ఎక్స్‎లో షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement