Tuesday, October 22, 2024

Paris Olympics | నేడు బరిలోకి నీరజ్ చోప్రా..

పారిస్ ఒలంపిక్స్ లో నేడు భారత్‌కు కీలక ఈవెంట్స్ ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు కిషోర్ జేనా కూడా క్వాలిఫికేషన్ రౌండ్ పోటీ పడనున్నాడు. మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో చైనాతో తలపడనుంది. భారత హాకీ టీమ్ సెమీస్‌లో జర్మనీతో తలపడనుంది.

భారత షెడ్యూల్..

టేబుల్ టెన్నిస్ :
పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్(శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మనవ్ థక్కర్) రౌండ్ 16 మ్యాచ్: ఇండియా వర్సెస్ చైనా- మధ్యాహ్నం 1.30 గంటలకు
మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్( మనికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీష్‌) క్వార్టర్ ఫైనల్: ఇండియా వర్సెస్ యూఎస్ఏ/జర్మనీ- సాయంత్రం 6.30 గంటలకు

అథ్లెటిక్స్ :
జావెలిన్ త్రో- గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ -కిశోర్ జేనా- మధ్యాహ్నం 1.50 గంటలకు
జావెలిన్ త్రో- గ్రూప్-బీ క్వాలిఫికేషన్ – నీరజ్ చోప్రా- మధ్యాహ్నం 3.20 గంటలకు
మహిళల 400 మీటర్లు- రేప్‌చేజ్ రౌండ్- కిరణ్ పహల్- మధ్యాహ్నం 2.50 నిమిషాలకు

హాకీ :
సెమీఫైనల్: భారత్ వర్సెస్ జెర్మనీ-రాత్రి 10.30 గంటలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement