టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ ముందు 160 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ తర్వాత డిఫెండింగ్లో రాణించింది. ఫలితంగా, డజ్ జట్టుపై 25 పరుగుల తేడాతో గెలిచింది.
భారీ చేధనలో నెదర్లాండ్స్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. బ్యాటర్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పారించారు. మైఖేల్ లెవిట్ (18), మాక్స్ ఓడౌడ్ (12), విక్రమ్జిత్ సింగ్ (26), సైబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (25), ఆర్యన్ దత్ (15 నాటౌట్) రాణించారు. అయితే, బెంగ్లా బౌలర్లు దాడి చేయడం ప్రారంభించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులకే నెదర్లాండ్స్ జట్టు పరిమితమైంది.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ మూడు వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్, మహ్మదుల్లా రియాద్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ బాదింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ తాంజిద్ హసన్ (35), మహ్మదుల్లా రియాద్ (25) రాణించారు. ఇక ఆఖర్లో వచ్చిన జాకర్ అలీ (14 నాటౌట్) బౌండరీలతో అదరగొట్టాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్లు గెలిచిన బంగ్లా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.