Monday, September 23, 2024

National – మిస్ యూనివ‌ర్స్ ఇండియాగా రియా సింఘా..

‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్‌ యువతి రియా సింఘా గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ పడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్ని బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

రియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నివాసి. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా దంపతుల కుమార్తె ఆమె. రియా టాప్ మోడల్. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రియా ఇన్‌స్టాలో బోల్డ్‌ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. . మిస్ యూనివర్స్ ఇండియా 2024కు ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ భారత్‌కు వస్తుందని ఊర్వశి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో ప్రాంజల్ ప్రియ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఛవీ వర్గ్, సుస్మితా రాయ్, రూప్‌ఫుజానో విసో తరువాతి స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement