Friday, September 27, 2024

National – పార్ల‌మెంట‌రీ క‌మిటీల‌లో రాహుల్, కంగ‌న ల‌కు చోటు

డిఫెన్స్ క‌మిటీలో రాహుల్
ఐటి క‌మిటీలో కంగ‌నా ర‌నౌత్

న్యూ ఢిల్లీ – తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన కంగనా రనౌత్ కు పార్లమెంటరీ కమిటీలో చోటు దక్కింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కమిటీలో కంగనా పేరును చేర్చారు. ఈమేరకు పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఫెన్స్ కమిటీలో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మరోసారి చోటు దక్కింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా, మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి నాలుగు కమిటీల సారథ్య బాధ్యతలను కేంద్రం అప్పగించింది.

విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్; విద్య, మహిళా, శిశు, యువత, క్రీడలకు సంబంధించిన కమిటీకి దిగ్విజయ్ సింగ్; వ్యవసాయం, పశువులు, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చరణ్ జిత్ సింగ్ చన్నీ; గ్రామీణం, పంచాయతిరాజ్ కమిటీకి సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వం వహిస్తారు. కాగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాత్రం ఏ కమిటీలోనూ చోటు దక్కలేదు. ఇక బీజేపీ ఎంపీల సారథ్యంలో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, బొగ్గు, గనులు, ఉక్కు, సమాచార, ఐటీ కమిటీలు ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement