Thursday, September 19, 2024

దేశం గర్వపడుతుంది… వినేష్ ఫోగట్‌కు అండగా రాష్ట్రపతి ముర్ము

ఒలింపిక్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పై అనర్హత వేటు పడింది. ఫైనల్‌ పోరులో పసిడి పతకం సాధిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయులను ఈ వార్త షాక్‌కు గురి చేసింది. ఈ క్ర‌మంలో వినేశ్‌ ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలని భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కోరారు. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్‌గా నిలిచార‌న్నారు.

‘పారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్‌ అసాధారణ ప్రతిభ కనబరిచారు. తన ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారు. ఈ స‌మ‌యంలో ఫొగట్‌కు అందరూ అండగా నిలవాలి. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫొగట్‌ ఛాంపియన్‌గా నిలిచారు. భవిష్యత్తు క్రీడాకారులకు ఆమె ఆదర్శంగా నిలుస్తారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు సాధించాలని కోరుకుంటున్నా.’ అని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement