నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ‘ఫిదా’ మాదిరిగానే ఈ చిత్రం కూడా తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బరువైన కథ. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా యూత్ లో ఆసక్తిని పెంచుతూ వస్తోంది. కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
ఎట్టకేలకు వినాయక చవితి పండుగ సందర్భంగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈరోజు విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని, సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీలో సారంగదరియా సాంగ్ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.