Friday, September 20, 2024

మార్చి 10న ఎపి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎల‌క్ష‌న్స్…షెడ్యూల్ విడుద‌ల‌..

అమ‌రావ‌తి – ఎపిలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల పోలింగ్ షెడ్యూల్ ను ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది. మార్చి 10న‌ మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 3 వరకు ఉంటుంది. అదే రోజు తుది జాబితాను ఎస్ఈసీ విడుదల చేయనుంది. మొత్తం 75పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించ‌నున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement