Thursday, October 17, 2024

Mumbai – ర‌త‌న్ టాటాకు చంద్ర‌బాబు నివాళి..

ముంబై – ప్రఖ్యాత పారిశ్రామిక రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)కి తరలించారు. ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ఎన్సీపీఏలో రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కూడా రతన్ టాటా భౌతికకాయాన్ని కడసారి వీక్షించి, ఆ దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళులు అర్పించారు.

టాటా కుటుంబ సభ్యులు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లకు వెన్నంటి ఉండి, రతన్ టాటా భౌతికకాయం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబు… రతన్ టాటా భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. . టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తోపాటు, గ్రూప్‌ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్‌ టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement