Sunday, September 8, 2024

Mumbai – యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో భారీ అగ్ని ప్రమాదం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ : ముంబయి : యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. .ఈ ఘటనలో ఓ జూనియర్‌ నావికుడు గల్లంతు కాగా.. అతడి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. మిగతా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళం పేర్కొంది.

ముంబయిలోని డాక్‌యార్డులో ఉన్న ఈ యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతిన్నట్లు నౌకాదళం వెల్లడించింది. ప్రమాదంలో యుద్ధనౌక ఓవైపు ఒరిగిపోయిందని.. సరైన స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదని సమాచారం. మరమ్మతుల కోసం డాక్‌యార్డులో నిలిపిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.’

- Advertisement -

‘ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్టులో ఐఎన్‌ఎస్‌ బ్రహ్మపుత్రకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది’ అని నౌకాదళం ప్రకటనలో పేర్కొంది.

.

అయితే, సోమవారం మధ్యాహ్నానికి నౌక ఓ పక్కకు ఒరిగిపోయిందని.. దాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేసినప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపింది.

ఒక జూనియర్‌ నావికుడు మినహా మిగతా సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని.. గల్లంతైన నావికుడి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంటూ నౌకాదళం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement