Monday, July 1, 2024

TS: డీఎస్ కు నివాళులర్పించిన ఎంపీ వద్దిరాజు..

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని డీఎస్ నివాసానికి శనివారం మధ్యాహ్నం తన సన్నిహితులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ఏనుగు రాజేందర్, ఆది విష్ణుమూర్తి, ఆకుల రజిత్, మరికల్ పోత సుధీర్ కుమార్, మాలి కరుణాకర్, ఊసా రఘులతో కలిసి వెళ్లి ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులతో కలిసి డీఎస్ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు, కుమారులు సంజయ్, అరవింద్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత నాయకుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement