Friday, September 13, 2024

MP Kesineni Sivanath – గన్నవరం నుంచి ఎయిర్ సర్వీసులు పెంచండి…

అన్ని ప్రాంతాలకు సర్వీసులు కల్పించండి
ఇండిగో సర్వేను తక్షణం అమలు చేయండి
కేంద్రమంత్రికి విజయవాడ ఎంపి విజ్ఞప్తి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో: ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అమరావతి ప్రాంతం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) అభ్యర్థించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమానయాన కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సోమవారం నాడు రామ్మోహన్ నాయుడుని కేసినేని కలిశారు. తొలుత మంత్రికి అభినందనలు తెలిపి, తన నియోజకవర్గంలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధిపై వినతి పత్రాన్ని అందజేశారు.

విజ‌య‌వాడ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు స‌ర్వీసులు..

- Advertisement -

విజయవాడ నుంచి వారణాసి వ‌యా వైజాగ్, విజయవాడ నుంచి కలకత్తా వ‌యా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వ‌యా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి పుణే విమాన స‌ర్వీసుల ప్రారంభించాల‌ని అభ్యర్థించారు. ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన స‌ర్వీసులు త‌క్షణం ప్రారంభించేలా చూడాల‌ని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement