Thursday, September 19, 2024

TG | హైడ్రాకు మ‌రింత భ‌ద్ర‌త‌…

హైడ్రా కమిషన్‌కు మరింత భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను ప్రత్యేకంగా కేటాయించారు.

అయితే గత ఆదివారం మాదాపూర్ ప్రాంతంలోని సున్నపు చెరువు వద్ద ఆక్రమణల నిర్మాణాలను తొలగిస్తుండగా.. కొందరు స్థానికులు హైడ్రా అధికారులపై దాడి చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమిస్తూ, హైడ్రా అధికారుల భద్రతను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement