Wednesday, October 9, 2024

AP | టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆ ఇరువురు నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ఎంపీలు వెంకటరమణ, మస్తాన్‌ రావుకు పసుపు కండువాలు కప్పిన సీఎం చంద్రబాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ కొల్లు రవీంద్ర, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement