Tuesday, September 17, 2024

Wayanad Areal Survey – కేర‌ళ‌కు అండ‌గా ఉంటాం …. ప్ర‌ధాని మోడీ

వ‌య‌నాడ్ లో ప్ర‌ధాని మోడీ ఏరియ‌ల్ స‌ర్వే
విల‌య ప్రాంతాల‌ను హెలికాప్ట‌ర్ నుంచి వీక్ష‌ణ
స‌హాయ పున‌రావాసానికి నిధులు ఇస్తాం
ఈ విషాదం నుంచి ఇక్క‌డి ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాలి
రోడ్లు, వంతెన‌లు నిర్మాణాల‌లో భాగ‌స్వాముల‌వుతాం
అన్ని విధాల ఆదుకుంటామ‌ని కేర‌ళ ప్ర‌భుత్వానికి హామీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ … వయనాడ్‌: ప్రకృతి ప్రకోపంతో విధ్వంసమైన కేర‌ళ‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని ప్ర‌ధాని మోదీ భ‌రోసా ఇచ్చారు… మ‌య‌నాడ్ ప్ర‌జ‌లు తిరిగి జ‌న‌జీవ‌నంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన సాయం కేంద్రం అందిస్తుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్ కు హామీ ఇచ్చారు..

ఇటీవ‌ల వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాల్లేకుండా శిథిలమమైన ప్రాంతాల‌లో నేడు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హెలికాప్ట‌ర్ లో నుంచి విల‌య ప్రాంతాల‌ను చూసి చ‌లించిపోయారు.. ఇంత తీవ్ర‌మైన విలయం ఇంత‌కు ముందు ఎన్న‌డూ రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు..

- Advertisement -

ముందుగా ప్ర‌ధాని ఈ ఉదయం కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు బయల్దేరారు. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్‌ గోపి కూడా ఉన్నారు.

హెలికాప్టర్ స‌ర్వే అనంత‌రం కాల్ పెట్ట నుంచి రోడ్డు మార్గంలో ప‌య‌నించి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.. రెస్క్యూ ఆపరేషన్‌, బాధితుల తరలింపు జరిగిన తీరును ప్రధానికి వివరించారు. అనంత‌రం సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించారు. వారిని ఓదార్చారు.. అంద‌రికీ అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. వైద్య చికిత్స‌, స‌హాయ కార్య‌క్ర‌మాల ఎలా సాగుతున్నాయ‌నే విష‌యాల‌ను బాధితుల‌ను అడిగి తెలుసుకున్నారు మోడీ .

అనంత‌రం ఆయ‌న క‌న్నూర్ లో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ కూడా పాల్లొన్నారు.. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంలోనూ, శిధిలాల నుంచి వెలికి తీయ‌డంలోనూ నిరంత‌రం శ్ర‌మించిన ఆర్మీ, పౌర‌,పోలీస్ అధికారుల‌ను మోడీ ప్ర‌శంసించారు.. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లోనూ వేలాది మంది ప్రాణాలు కాపాడిన రెస్క్యూ సిబ్బందిని అభినందించారు..

కాగా , క‌ష్టంలో కేర‌ళ‌ను అన్నివిధాల ఆదుకుంటామ‌ని మోడీ చెప్పారు.. రోడ్డు,భువ‌న‌, వంతెన‌లు, విద్యుత్ నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మై మేర కేంద్రం సాయం చేస్తుంద‌ని సిఎంకు చెప్పారు.. అలాగే బాధితులు తిరిగి జ‌న‌జీవ‌నంలో వ‌చ్చేందుకు వారికి కూడా త‌గిన సాయం అందిస్తామ‌ని అన్నారు.. కేర‌ళ ప్ర‌జ‌ల‌ను అదుకునేందుకు దేశ ప్ర‌జ‌లంద‌రూక‌లిసి రావాల‌ని మోదీ పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement