Thursday, September 19, 2024

MMTS | ఆ రెండు రోజులు అందుబాటులో నైట్ సర్వీస్ !

గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో.. నిమజ్జన వేడుకలను చూసేందుకు వీలుగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్ర‌త్యేక స‌ర్వీసులు ఉదయం 4 గంటల వరకు ఈ న‌డ‌వ‌నున్నాయి.

17వ తేదీ రాత్రి 11 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ – లింగంపల్లి,
17వ తేదీ రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్ – హైదరాబాద్‌ కు,
18 వ తేదీని అర్థరాత్రి 12 గంటల 10 నిమాషాలకు లింగం పల్లి – ఫలక్‌నుమా,
18 తేదీ రాత్రి 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ – లింగంపల్లికి,
18 వ తేదీ ఉదయం 1గంట 50 నిమిషాలకు లింగంపల్లి – హైదరాబాద్‌,
18వ తేదీన రాత్రి 02:20 గంటలకు ఫలక్‌నుమా – సికింద్రాబాద్‌‌,
18వ తేదీన రాత్రి 03:30 గంటలకు హైదరాబాద్ – సికింద్రాబాద్,
18వ తేదీన ఉదయం 04:00 గంటలకు సికింద్రాబాద్‌ – హైదరాబాద్‌‌‌ కు ఈ రైలు సర్వీసులు నడుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement