Thursday, September 19, 2024

Paris Olympics | ఆర్చరీలో చేజారిన ప‌త‌కం..

పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో ప‌త‌కం భార‌త్ చేజారింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ ఓట‌మి పాలైంది. సెమీఫైన‌ల్లో దక్షిణ కొరియాతో తలపడిన ధీరజ్-అంకిత జోడీ 6-2 పాయింట్ల తేడాతో ఓడి… కాంస్య పతకం కోసం అమెరికాతో పోటీ పడింది. అయితే, ఈ పోటీలో అమెరికా జోడీ బ్రాడీ ఎలిసన్ – కేసీ కౌఫోల్డ్ తొలి సెట్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీంతో ధీరజ్-అంకిత జోడీ అమెరికా చేతిలో 6-2 పాయింట్ల తేడాతో పతకాన్ని కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement