Thursday, September 12, 2024

AP | సీఎం చంద్ర‌బాబును క‌లిసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్

తెలంగాణ జలవనరులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఈరోజు (సెప్టెంబర్ 12న) ఏపీలోని విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి వెళ్లారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి విజయవాడ వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. తన వ్యక్తిగత పని ముగించుకున్న ఉత్తమ్ దంపతలు.. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement