Friday, October 18, 2024

Mega Star – ఒలింపిక్స్ లో ఆ క్ష‌ణం మ‌రిచిపోలేను…..

ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు పారిస్‌లో అంగరంగ వైభవంగా నిర్వ‌హించారు. ఈ వేడుకలు చూసేందుకు పలువురు సినీ తారలు, సందర్శకులు తరలివచ్చారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కుటుంబం ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈమేరకు తన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఓ ఆసక్తికర ఫొటోని తాజాగా ఆయన ఎక్స్‌లో షేర్‌ చేశారు.


”పారిస్‌ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషకరమైన క్షణం. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌. పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement