Thursday, September 19, 2024

Medical – క‌రోనా కార‌ణంగా డ‌యాబెటిస్‌! –

కొవిడ్ సోకిన చిన్నారుల్లో గుర్తింపు
బ‌య‌ట‌ప‌డ్డ టైప్-1 షుగర్​ లక్షణాలు
ప‌రిశోధ‌న‌ల్లో క‌నుగొన్న శాస్త్రవేత్త‌లు
ఇదే నిర్ధారించిన‌ జ‌ర్మ‌నీ ప‌రిశోధ‌కులు
ఆటో ఇమ్యూన్ రుగ్మ‌త త‌లెత్తిన‌ట్టు వెల్ల‌డి
వాయు కాలుష్యంతోనూ డ‌యాబెటిస్ వ‌చ్చే చాన్స్‌

టైప్‌-1 మధుమేహం అనేది ఆటోఇమ్యూన్‌ రుగ్మత. దీన్ని సింపుల్​గా చెప్పాలంటే, వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక వ్యవస్థ అదపు తప్పి, ఆరోగ్యంగా ఉన్న స్వీయకణాలు, అవయవాలపైనే దాడి చేస్తుంది. ఇటువంటి వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వీరికి చికిత్స కోసం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నప్పుడు, ఐలెట్‌ ఆటోయాంటీబాడీలు ఉత్పత్తి అవుతుంటాయి. దీంతో రక్త నమూనాలో వీటి ఉనికి ఆధారంగా టైప్‌-1 మధుమేహాన్ని డాక్ట‌ర్లు గుర్తిస్తారు.

- Advertisement -

ప‌రిశోధ‌న‌ల్లో ఇదే తేలింది..

కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్‌ ఆటోయాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు ఇంతకు ముందు చేసిన పరిశోధనల్లో తేలింది. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు మరో అంశాన్ని కొనుగొన్నారు. ఐలెట్‌ ఆటోయాంటీబాడీలు ఇప్పటికే కలిగిన (టైప్‌-1 మధుమేహం ఆరంభ దశలో ఉన్న) చిన్నారులు కరోనా బారినపడితే, వారిలో టైప్‌-1 మధుమేహ (షుగర్​) వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కనుగొన్నారు.

వాయు కాలుష్యంతో డయాబెటిస్

వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు పాడై కేన్సర్, గుండెపోటు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతార‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే.. కలుషితమైన గాలి పీల్చుకోవడంతో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇటీవల చేసిన అధ్యయనాల్లో ఇదే నిరూపిత‌మైన‌ట్టు శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యంతో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement