Wednesday, September 18, 2024

Manchiriala – ఏసీపీ ఆఫీసు ఆవరణలో కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ బ్యూరో : మంచిర్యాల ఏసీపీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బైరి సత్యనారాయణ సర్జికల్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నారు. సీసీ నస్పూర్ మున్సిపాలిటీ సిబ్బంది విధులకు ఆటంకం క‌లిగించార‌ని, దూషించార‌ని కౌన్సిలర్ బైరి సత్యనారాయణ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

పరారీలో ఉన్న వైర సత్యనారాయణను పోలీసులు ప‌ట్టుకుని హైదరాబాద్ నుండి మంచిర్యాలకు తీసుకొచ్చారు. ఆదివారం ఏసీపీ తో సహా పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టే క్రమం లో ఆయ‌న‌ తన జేబులో ఉన్న సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోసుకొన్నారు. పోలీసులు అడ్డుకొని నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయ‌న‌పై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement