Thursday, October 24, 2024

TG | సెంట్రల్ స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుడిగా మల్లురవి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా నాగర్‌కర్నూలు ఎంపి మల్లురవి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీకి కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి జయంత్‌ చౌదరి చైర్మన్‌గా ఉంటారు. లోక్‌సభ నుంచి 7 మంది, రాజ్యసభ నుంచి 7 మంది, ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఇద్దరు మొత్తం 16 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్లు రవితో పాటు , వరంగల్‌ ఎంపి కడియం కావ్య నియమితులు కావడం విశేషం .

Advertisement

తాజా వార్తలు

Advertisement