Wednesday, September 18, 2024

T Congress – కొత్త చీఫ్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేడు బాధ్యతలు స్వీకరించ నున్నారు. . ముందుగా ఆయన గన్ పార్కుకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.

అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. గాంధీ భవన్ లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రస్తుత పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి వద్ద నుంచి మహేష్ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకుంటారు. ఆ తరువాత ఇందిరాభవన్ ముందు బహిరంగ సభ నిర్వహించనున్నారు.

- Advertisement -

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. నూతన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కేడర్ పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు తరలిరానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement