Thursday, September 19, 2024

Tamilanadu : లారీ – కారు ఢీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిదంబరం వద్ద ఓ లారీ.. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలాడుతురైకి చెందిన 56ఏళ్ల మహ్మద్‌ అన్వర్ తన కుటుంబంతో కలిసి చెన్నైలోని తమ బంధువులను కలిసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పి ముట్లూరు వంతెనపై వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను మహ్మద్‌ అన్వర్‌, యాసర్‌ అరాఫత్‌, ఇద్దరు మహిళలు హజీరా బేగం, హరాఫత్నీషా, మూడేళ్ల బాలుడు అబ్నాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement