Thursday, September 12, 2024

Wayanad | బ్యాంకు కీలక నిర్ణయం.. వారందరికీ రుణ‌మాఫీ

వయనాడ్ వరద బాధితులకు స్థానికంగా ఉన్న ఓ బ్యాంకు భారీ ఊరట కల్పించింది. కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి విలయం నేపథ్యంలో జిల్లా సహకార బ్యాంకుల సమాఖ్య కేరళ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి బీభత్సం కార‌ణంగా నష్టపోయిన వారి రుణాలను మాఫీ చేస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

జిల్లాలో సంభవించిన విపత్తును దృష్టిలో ఉంచుకుని చూరల్‌మల బ్రాంచ్‌లో రుణాలు తీసుకుని చనిపోయిన వారితో పాటు, లోన్లు తీసుకునేందుకు సెక్యూరిటీలుగా తాకట్టు పెట్టిన ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారి రుణాలను మాఫీ చేయాలని కేరళ బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ మొత్తం లోన్ల విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement