Saturday, July 6, 2024

LK Advani | బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

బీజేపీ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అయితే అద్వానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అద్వానీ ప్రస్తుతం డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement