Thursday, September 19, 2024

Liquor Scam కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. బుధ‌వారంతో కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీని తీహార్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు కేజ్రీ కస్టడీని సెప్టెంబర్‌ 25 వరకూ పొడిగించింది. ఇక.. ఇదే కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు బెయిల్‌ లభించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీతోపాటు దుర్గేష్‌ పాఠక్‌కు సమన్లు పంపింది. ఈ సమన్లకు స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన బెయిల్‌ పొందారు.

సుప్రీంలో తీర్పు రిజ‌ర్వ్‌..

మరోవైపు బెయిల్‌ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 5న విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌ కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణ జరపింది. కేజ్రీ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement