Thursday, July 4, 2024

విభజన సమస్యలపై చ‌ర్చించుకుందాం… రేవంత్‌ రెడ్డికి చంద్రబాబు లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. విభజన సమస్యలపై చర్చించుకోవాలని, పొరుగు రాష్ట్రాల మాదిరిగా పరస్పరం సహకరించుకోవాలని చంద్రబాబు అన్నారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదన్నారు చంద్రబాబు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి కూర్చోని విభజన సమస్యలపై చర్చించుకుందామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement