Tuesday, October 22, 2024

KTR | రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి..

తెలంగాణలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎఓస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి హోం మినిస్టర్ లేక‌పోగా… పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీగా ఉన్నారని, చట్టం అమలులో వెనకడుగు వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాగా, ఉన్నతాధికారులలో ఇక‌నైనా వివేచనతో విధులు నిర్వహించాలని కోరారు.. సమర్ధులైన పోలీసు అధికారులు శాంతి, సామరస్యాలను కాపాడే ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించే స్వేచ్ఛ లభిస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement