Tuesday, September 17, 2024

J&K | వైష్ణో దేవి మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు… ముగ్గురు మృతి

జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని శరవేగంగా శిథిలాలను తొలగించడం ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు వైష్ణో దేవి ఆలయానికి రాకపోకలపై ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అయిన‌ప్ప‌టికీ కొందరు భక్తులు మరో మార్గం పాత సంజిచాట్ గుండా ప్రయాణం కొనసాగిస్తున్నారని శ్రీ మాతా వైష్ణో దేవి మందిర్ బోర్డు సీఈవో ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement